GT VS MI : కొట్టుకున్న ముంబై, గుజరాత్ ఫ్యాన్స్

-

ఐపీఎల్ 2024 టోర్నమెంటులో ముంబై ఇండియన్స్ జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. గెలుపు వరకు వచ్చి చేజేతుల మ్యాచ్ పోగొట్టుకుంది ముంబై ఇండియన్స్. నిన్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది.

Violent Clash Breaks Out Between Fans At Narendra Modi Stadium Amid GT vs MI IPL 2024 Match

అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ అది నుంచి ఇబ్బంది పడ్డది. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 162 పరుగులు మాత్రమే చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ 6 పరుగులు తీయడంతో మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అయితే.నిన్న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్-ముంబై మ్యాచులో ఘర్షణ జరిగింది. గ్యాలరీలో ఉన్న ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ముంబై, గుజరాత్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగినట్లుగా సమాచారం.

https://x.com/TeluguScribe/status/1772107942038552676?s=20

Read more RELATED
Recommended to you

Exit mobile version