వివాదంలో విరాట్ కోహ్లీ ఇరుక్కున్నారు. ఐపీఎల్లో భాగంగా నిన్న రాత్రి పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో అతి దారుణంగా ఓటమిపాలైన పంజాబ్… ఫైనల్ ఛాన్స్ పోగొట్టుకుంది. వరుసగా వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు ముషీర్ ఖాన్.

అయితే.. ముషీర్ ఖాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతన్ని కించపరుస్తూ కోహ్లీ స్లెడ్జింగ్ చేస్తున్నట్టు ఓ వీడియో బయటికి వచ్చింది. ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ.. ముషీర్ ఖాన్ను ఉద్దేశించి వాటర్ బాయ్ అంటూ కామెంట్ చేశాడని విమర్శలు చేసాడు. ఒక స్టార్ ప్లేయర్ వ్యవహరించాల్సిన తీరు ఇది కాదంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
. @imVkohli : "Paani pilata hai yeh" (he serves water to others) (Laughing)
"I really dislike this attitude from Kohli. Yes, Musheer Khan serves water to the team when he's on the bench, and don't forget, he's a player." #RCBvsPBKS @RCBTweets pic.twitter.com/UWN1ZFioYJ
— KK 🦅 (@KK_apjsp) May 30, 2025