పాత నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన

-

పాత నోట్లపై తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. పాత నోట్లతో ఫర్నిచర్ తయారు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గత కొన్ని రోజులుగా పాత నోట్లు అలాగే చినిగిన నోట్ల విషయంలో జనాలు అంతా గందరగోళంగా ఉన్నారు.

Reserve Bank of India key announcement on old notes
Reserve Bank of India key announcement on old notes

వాటిని ఏం చేయాలి అనే దానిపైన.. ఆలోచన చేస్తున్న నేపథ్యంలో తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఇకపై చిరిగిన, వాడుకలో లేని కరెన్సీ నోట్లను కాల్చడం లేదా కరిగించడం కంటే పర్యావరణ అనుకూలమైన రీతిలో ఉపయోగిస్తామని చెప్పింది. ఈ నోట్స్‌తో పార్టికల్ బోర్డులు తయారు చేయనున్నట్టు వార్షిక నివేదికలో పేర్కొంది. అలాగే ఫర్నిచర్ తయారు చేస్తామని వెల్లడించింది. ఇప్పటివరకు ఏటా 15,000 టన్నుల నోట్లు నాశనం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news