IPL 2023 : 84 డాట్ బాల్స్…మొక్కలు నాటనున్న BCCI

-

పర్యావరణ పరిరక్షణ కోసం బీసీసీఐ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్లేఆఫ్స్ లో బౌలర్ ఒక్క డాట్ బాల్ వేస్తే 500 మొక్కలు నాటనున్నట్లు ప్రకటించింది. నిన్న చెన్నై-గుజరాత్ మధ్య క్వాలిఫైయర్-1 మ్యాచ్ లో మొత్తం 84 డాట్ బాల్స్ నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా 42,000 మొక్కలు నాటనుంది. బీసీసీఐ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నాయి.

కాగా, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ఫైనల్ కు చేరిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు సృష్టించింది. ఈ సీజన్ తో కలిపి ఇప్పటివరకు మొత్తం 14 సీజన్ లలో 10సార్లు ఫైనల్ కు వెళ్ళింది. 4సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై… అత్యధికంగా 12 సార్లు ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది. 2008, 2010, 2011, 2012, 2013, 2015, 2018, 2019, 2021, 2023 సీజన్లలో ఫైనల్ కు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version