ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చిన శ్రీలంక మహిళలు … 104 కు ఆల్ అవుట్ !

-

ఇంగ్లాండ్ మరియు శ్రీలంక మహిళల మధ్యన మూడు మ్యాచ్ ల టీ 20 మరియు మూడు వన్ డే ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొన్న జరిగిన మొదటి టీ 20 లో ఇంగ్లాండ్ మహిళలు శ్రీలంకను చిత్తు చేశారు. ఇక రెండవ మ్యాచ్ ఈ రోజు జరుగుతుండగా టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. బదులుగా బ్యాటింగ్ లో ఇంగ్లాండ్ మహిళలు స్వల్ప స్కోర్ కె జెండా ఎత్తేశారు. 18 ఓవర్ లపాటు బ్యాటింగ్ చేసి కేవలం 104 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయ్యారు. ఇది నిజంగా శ్రీలంక పై అత్యంత చెత్త ప్రదర్శన అని చెప్పాలి. ఇంగ్లాండ్ కంటే ఎంతో బలహీనమైన శ్రీలంక చేతిలో ఈ స్థాయిలో ఫెయిల్ అవ్వడం అంటే నమ్మలేని నిజం అని చెప్పాలి. ఇంగ్లాండ్ మహిళలలో డీన్ ఒక్కరే 34 పరుగులు చేశారు. మిగిలిన వారందరూ శ్రీలంక మహిళల బౌలింగ్ దెబ్బకు చేతులెత్తేశారు.

శ్రీలంక బౌలర్లలో ప్రభోధిని, ప్రియదర్శని , దిల్హార మరియు రణవీర లు తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఛేదనలో అయినా ఇంగ్లాండ్ బౌలర్లు ఆకట్టుకుని శ్రీలంకను ఓడిస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news