శ్రీముఖి సెట్ లో అలా ఉంటుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడు..!!

-

బుల్లితెర హోస్ట్ , యాంకర్ గా ఒక వెలుగు వెలుగుతున్న యాంకర్ శ్రీముఖి సినీ ఇండస్ట్రీలో కూడా కొన్ని సినిమాలలో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక పోతే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న శ్రీముఖి తన నటనతో మరింత మంది ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది. ఇకపోతే శ్రీముఖి గురించి ప్రముఖ నటుడు రాజారవీంద్ర ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.

రాజా రవీంద్ర, భరణి, శ్రీముఖి, సింగర్ మనో అందరూ కలిసి కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం క్రేజీ అంకుల్స్. ఈ సినిమాకు సత్తిబాబు దర్శకత్వం వహిస్తుండగా పూర్తి హాస్యభరితంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో తనతో పాటు నటించిన శ్రీముఖి గురించి రాజా రవీంద్ర మాట్లాడుతూ ఆ అమ్మాయి చాలా బబ్లీ గా వుంటుంది. కానీ ఈ సినిమాలో తన పాత్ర చాలా సీరియస్ గా ఉంటుంది.. తను సెట్లో ఆటపట్టించే అంత చనువు అయితే లేదు.. కానీ మన తాను మనో తో ఎక్కువ సార్లు షో లు చేయడం వల్ల తనతో చనువుగా ఉంటుంది. నాతో చాలా తక్కువగా మాట్లాడుతుంది అంటూ రాజారవీంద్ర వివరించారు.

ఇక రాజా రవీంద్ర శ్రీముఖి గురించి మాత్రమే కాకుండా మరి ఎన్నో విషయాలను ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు. ఇకపోతే ఈయన గతంలో స్టార్ హీరోలకు మేనేజర్ గా కూడా పని చేసి, ఆ స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి డేట్స్ కూడా అడ్జెస్ట్ చేసే వాడిని అని రాజారవీంద్ర వెల్లడించారు. ఇకపోతే ఒకానొక సమయంలో హీరో రవితేజ కి మేనమామ గా మారి పెళ్లి సమయంలో కాళ్లు కూడా కడిగారట. ఇక రాజా రవీంద్ర ఆ తర్వాత నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version