అక్రమాలు చేయాలంటే హడలి పోవాలి – మంత్రి వి శ్రీనివాస్ గౌడ్

-

రాష్ట్రంలో దుర్మార్గులు హడలి పోవాలని తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ లో ఇవాళ మీడియాతో మాట్లాడారు. అక్రమాలు చేయాలంటే హడలి పోవాలని పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.

డబ్బులతో ఇళ్లు వస్తుందంటే అది ముమ్మాటికీ అక్రమమేనని స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగానే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నామని ప్రకటించారు. ఆడియో టేపుల వ్యవహారంపైన విచారణకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. అక్రమార్కులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఓ రేంజ్‌ లో హెచ్చరికలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version