అలాంటి వేషాలు వేస్తే జగన్ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా …

-

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినా ఎన్సీఆర్, సిఏఏ, ఎన్సీపీ చట్టాలకు వ్యతిరేకంగా గుంటూరులో ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది. జరిగిన ఈ సభకు ఓవైసీ పార్టీ అధినేత అసదుద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే దేశంలో ఇటువంటి పరిస్థితులు వచ్చేవే కాదని ఇలాంటి చట్టాల వల్ల దేశం నష్టపోతుందని ప్రసంగించారు. అంతేకాకుండా అన్నదమ్ముల్లాగా ఉన్న హిందూ, ముస్లింల మధ్య గొడవలు తీసుకురావటానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదే సభకు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ ఎన్సీఆర్, సిఏఏ, ఎన్సీపీ విషయంలో మైనార్టీలకు వైసిపి పార్టీ అండగా ఉంటుంది స్పష్టం చేశారు, ఈ సందర్భంగా ఈ మూడు బిల్లులకు వ్యతిరేకంగా వైయస్ జగన్ ని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టాలని కామెంట్ చేయటం అందరికీ ఆశ్చర్యాన్ని పరిచింది.

 

అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయి ఉండి వైయస్ జగన్ ని ఇరికించే విధంగా ముస్తఫా ప్రసంగించారు. ఇదే సమయంలో అసద్ తర్వాత మాట్లాడిన ముస్తాఫా తనిష్టం వచ్చినట్లు కొద్దిగా ముస్లిం లీడర్లపై కామెంట్లు చేయడంతో అసదుద్దీన్ ముస్తఫా ని ఉద్దేశించి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే జగన్ ఎమ్మెల్యే అని చూడను అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇవ్వటం జరిగిందట. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరూ కలిసికట్టుగా ఉండాలి ఇటువంటి సమయంలో ఇలాంటి కామెంట్ చేయకూడదు అని తర్వాత ఎమ్మెల్యే ముస్తఫా కి అసదుద్దీన్ తెలియజేశారు అంట.

Read more RELATED
Recommended to you

Exit mobile version