విశాఖ గీతం మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య..

-

విశాఖపట్నంలోని గీతం మెడికల్ కాలేజీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర విషాదాన్ని నింపింది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన విస్మాద్ సింగ్ (20), కళాశాల భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ దుర్ఘటన వెనుక ర్యాగింగ్ కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. విస్మాద్ సింగ్ ఆత్మహత్యకు కొందరు సీనియర్ విద్యార్థుల వేధింపులే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విస్మాద్‌ను గత కొంతకాలంగా ర్యాగింగ్ చేస్తూ వేధించారని సమాచారం.

ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ర్యాగింగ్ ఆరోపణలపై లోతుగా విచారణ జరుపుతున్నారు. కళాశాల ప్రాంగణంలో ఇలాంటి సంఘటన జరగడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ సంఘ‌ట‌న‌పై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

మృతుడు: విస్మాద్ సింగ్ (20)

నివాసం: హిమాచల్ ప్రదేశ్, చంబా జిల్లా

సంఘటన: కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

ఆరోపణ: ర్యాగింగ్ కారణంగానే విస్మాద్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Latest news