Sudarshan Reddy is upset: తెలంగాణ కేబినెట్ విస్తరణ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. మూడు మంత్రి పదవులను భర్తీ చేసింది కాంగ్రెస్ హై కమాండ్. ఈ నేపథ్యంలో మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డ నేతలు అందరూ ఇప్పుడు నిరాశలో ఉన్నారు. చాలామంది నేతలు అలిగి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో పాటు.. ప్రేమ్ సాగర్ రావు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలకు దూరంగా ఉంటున్నారట. తాజాగా బోధన్ ప్రాంత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీపై అలిగినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి రాకపోవడంతో ఆయన అలిగినట్లు సమాచారం. రేపు బోధన్ బంద్ కు కూడా లోకల్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. పార్టీ పదవులకు కూడా ముకుమ్మడిగా రాజీనామా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. రాజీనామా చేసి టీపీసీసీ చీఫ్ కు పంపించాలని లోకల్ నాయకులు అనుకుంటున్నట్లు సమాచారం అందుతాయి.