హైదరాబాద్ పరిధిలోని నల్లగండ్లలో పలువురు క్రికెటర్లు, నటులు సందడి చేశారు. శుక్రవారం అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన టీబీసీ సెలూన్ ప్రారంభోత్సవానికి సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ క్రికెటర్లు హాజరై సందడి చేశారు.
ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ హెయిర్ సెలూన్ నల్లగండ్లలో నూతన బ్రాంచ్ను ప్రారంభించగా.. సన్రైజర్స్ ఆటగాడు నితీశ్ రెడ్డి, ఆస్ట్రేలియా క్రికెటర్లు మార్కస్ స్టాయినిస్తో పాటు మరికొందరు క్రికెటర్లు, సినీ నటులు అక్కడకు వెళ్లి సందడి చేశారు. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.