విద్వేషపూరిత ప్రసంగాల అంశంపై మీడియాకు సుప్రీం ప్రశ్నలు

-

భారతదేశం ఎటువైపు వెళ్తుందో అర్థంకావడం లేదని సుప్రీం కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. విద్వేషపూరిత ప్రసంగాల అంశంపై విచారణ చేపట్టిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మీడియాలో, సోషల్ మీడియాలో చాలా ద్వేషపూరిత ప్రసంగాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రసంగాలతో దేశంలో అలజడి రేగుతోందని విచారం వ్యక్తం చేసింది.

టీవీలో జరిగే చర్చల్లో యాంకర్లకు పెద్ద బాధ్యత ఉందని.. కానీ టీవీ యాంకర్లు అతిథికి సమయం కూడా ఇవ్వరని అభిప్రాయపడింది. ఇలాంటి వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించిన జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషీకేశ్ రాయ్ ధర్మాసనం.. కఠినమైన నియంత్రణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. దీనిపై రెండు వారాల్లో సమాధానంఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను నవంబర్ 23కి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version