హైదరాబాద్ చేరుకున్న సుప్రీం ఎక్స్‌పర్ట్ కమిటీ.. మధ్యాహ్నం 2 గంటలకు!

-

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిశీలించేందుకు సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ఎక్స్‌పర్ట్ కమిటీ కాసేపటి క్రితమే నగరానికి చేరుకున్నది.కంచ గచ్చిబౌలి లోని 400 ఎకరాల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద సుప్రీం ఆగ్రహం వ్యక్తం విషయం తెలిసిందే. దీనిపై క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని సర్వోన్నత న్యాయస్థానం కమిటీని ఆదేశించింది.

వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేసేందుకు నిన్న సాయంత్రం 7:45 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు పర్యావరణ, అటవీ శాఖల సాధికారిక కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్,మరో ముగ్గురు సభ్యులు చేరుకోగా.. ఉదయం 10 గంటల ప్రాంతంలో హెచ్‌సీయూ భూములను పరిశీలించాల్సి ఉంది. కానీ, ఆలస్యమైనట్లు సమాచారం. కంచె గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన, వాస్తవ పరిస్థితుల అధ్యయనం తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఈ కమిటీ సమావేశం కానున్నది.

Read more RELATED
Recommended to you

Latest news