ఉగ్రవాది మసూద్ అజహర్ చెప్పితేనే సీఎం కేసీఆర్ నమ్ముతాడు కావచ్చు- బండి సంజయ్

-

జవాన్ల త్యాగాన్ని కించపరచడం.. సర్జికల్ స్ట్రైక్ జరగలేదని సీఎం కేసీఆర్ మాట్లాడటం సరికాదని.. సీఎం కేసీఆర్ అంత దేశద్రోహి ఎవరూ లేరని బీజేపీ తెలంగాణ అధ్యక్షడు బండి సంజయ్ ఫైర్ అయ్యాడు. జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాది మసూద్ అజహర్ చెబితే సీఎం కేసీఆర్ నమ్ముతాడు కావచ్చు అంటూ విమర్శించారు. నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలన్నీ అబద్దాలే అని ఆయన అన్నారు. సైనికులు చెప్పినా నమ్మరు, దేశ ప్రధాని చెప్పినా నమ్మరు.. పాకిస్తాన్ చెప్పినా నమ్మరా అని ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రైక్ తరువాత దేశ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకున్నారని గుర్తు చేశారు. జవాన్ల త్యాగాలను కించపరుస్తున్న కేసీఆర్ ఏ దేశానికి మద్దతు పలుకుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్య మంత్రి ఏ మాత్రం సిగ్గు లేదని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. భారత దేశ సైనికులపై దాడులు చెస్తే.. భారత సైనికులు దాడి చేస్తే శవాలను కూడా తీసుకెళ్ల లేదని బండి సంజయ్ అన్నారు. ఈ దేశ ద్రోహి, దుర్మార్గుడు వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అని విమర్శించారు. దేశాన్ని మార్చడానికి ఇక వెళ్తాడా.. అని ఎద్దేవా చేశారు. నెక్స్ సర్జికల్ స్ట్రైక్ చేస్తే.. సీఎం కేసీఆర్ ని తీసుకెళ్లాలని రాజ్ నాథ్ సింగ్ ను కోరుతా.. అని ఎద్దేవాచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version