తమిళ్ సినీ ఇండస్ట్రీ సంచలన నిర్ణయాలు..!

-

తమిళ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతల మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. అడ్వాన్స్ లు తీసుకొని పూర్తి చేయని నటి నటుల పై కొరడా ఝుళిపించింది. ఆగస్ట్ 15 తరువాత కొత్త సినిమా షూటింగ్స్ నిలిపివేసిన నిర్మాతల మండలి నిరలించుకుంది. పెండింగ్ లో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తరువాతే కొత్త సినిమాల షూటింగ్స్ ప్రారంభిచాలని.. పెండింగ్ మూవీలకు ఇచ్చిన అడ్వాన్స్ ల పై నిర్మాతలను నివేదిక ఇవ్వాలని కోరింది మండలి. ఇక నుంచి ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమాకు కాల్ షిట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయనుంది.

అలాగే ఇక పై ఏ హీరో హీరోయిన్ కూడా అడ్వాన్స్ తీసుకోవడం నిషేధించింది. అదే విధంగా నటుడు ధనుష్ తీరుపై నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అడ్వాన్స్ లు తీసుకొని షూటింగ్స్ పూర్తి చేయడం లేదని ధనుష్ పై ఫిర్యాదులు ఉన్నాయి. ఇక పై నిర్మాతల మండలి పర్మిషన్ ఉంటేనే ధనుష్ సినిమాల షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news