బాలూ జ్ఞాపకాలు, కన్నీరు తెప్పించే ఫోటోలు షేర్ చేసిన తనికెళ్ళ భరణి…!

-

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను ఆయన సాటి నటులు, సాటి గాయకులూ, జూనియర్ గాయకులూ అందరూ కూడా నేమరవేసుకుంటూ సోషల్ మీడియాలో పలు ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణీ కూడా ట్విట్టర్ లో నివాళి అర్పించారు.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో భాగా వైరల్ అవుతూ ఉన్నాయి. మిథునం సినిమాలో తీసిన కొన్ని సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు, బాలుతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు పోస్ట్ చేసారు. ఆ సినిమాకు తనికెళ్ళ భరణీ దర్శకుడిగా వ్యవహరించారు. 2012 లో వచ్చిన ఈ చిత్రానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. బాలు, లక్ష్మీ మాత్రమే ఈ సినిమాలో కనపడతారు. బాలు నటనకు నంది అవార్డ్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version