దళితులకే పుట్టావా.. వీరాంజనేయ స్వామి పై మంత్రి మేరుగ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని టిడిపి డిమాండ్

-

స్పీకర్ ఛాంబర్ కు వెళ్లారు టీడీపీ ఎమ్మెల్యేలు. డొలా బాల వీరాంజనేయ స్వామిపై మంత్రి మేరుగ నాగార్జున చేసిన కామెంట్లపై స్పీకరుకు ఫిర్యాదు చేశారు. దళితులకే పుట్టావా అంటూ మంత్రి మేరుగ నాగార్జున వీరాంజనేయ స్వామిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభ్యుల పుట్టుక గురించి అధికార పార్టీ నేతలు పదే పదే ప్రస్తావించడంపై తీవ్ర వాగ్వాదం నెలకొంది.

ఈ తరహా వ్యాఖ్యలను స్పీకరుగా ఉండి.. కంట్రోల్ చేయకుంటే ఎలా అంటూ విరుచుకుపడ్డారు టీడీపీ ఎమ్మెల్యేలు.టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ ఛాంబరులో ఉండగానే లోపలకు వచ్చారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. మేరుగ నాగార్జున ఆ తరహా కామెంట్లు చేయలేదని అన్నారు శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు టీడీపీ ఎమ్మెల్యేలు. రికార్డులు పరిశీలించుకోండంటూ స్పష్టం చేసారు పయ్యావుల.

గతంలో చంద్రబాబు, లోకేష్ గురించి ఇదే తరహాలో ప్రస్తావించి రికార్డుల్లేవన్నారని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యేలు. తాను చేసిన వ్యాఖ్యలను మేరుగ నాగార్జున వెనక్కి తీసుకునేలా సూచించాలని స్పీకరును డిమాండ్ చేసారు ఎమ్మెల్యేలు.మేరుగ క్షమాపణ చెప్పకుంటే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సభ తిరిగి ప్రారంభించగానే మేరుగ కామెంట్లపై సభలో ప్రస్తావించనుంది టీడీపీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version