వైసీపీ నేతలు పిల్లులు.. జగన్ ఓ గాలిగాడు : నారా లోకేష్ సంచలనం

-

కుప్పంలో నారా లోకేష్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని.. అడ్డగోలుగా మాపై కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. అనంతపురంలో విద్యార్థులపై దాడి, అమరావతి రైతుల పై లాఠీఛార్జ్ అమానుష ఘటన అని.. ఏపీ  ప్రజలపై ఇది లాఠీ ఛార్జ్…అని పేర్కొన్నారు. ఖాకీలు లేకుండా వైసిపి నేతలు బయటకు రాగలరా ? వైసిపి నేతలు పిరికి వారు, పిల్లులు…అంటూ రెచ్చిపోయారు.

వైఎస్సార్ ఎన్నో అన్నారు… చివరకు ఏమైందో జనాలకు తెలుసని.. అమరావతి రైతులపై లాఠీచార్జి బాధ కలిగించిందన్నారు..త్వరలో ప్రజా ఉద్యమం రానుంది అందులో గాలిగాడు జగన్ కొట్టుకు పోతాడని హెచ్చరించారు. 2024లో టిడిపి విజయం ఖాయమనీ.. దొంగ సంతకాలతో 14వ వార్డు ఏకగ్రీవం చేసుకున్నారని ఫైర్ అయ్యారు. సాక్షి జీతగాడు అడ్డగోలు సలహాలు ఇస్తున్నాడని.. డిజిపికి చట్టం తెలుసా….? అని ప్రశ్నించారు. కోర్టు చెప్పినా ప్రచారం ఎందుకు చేయనివ్వరని.. టిడిపి అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టామనీ హెచ్చరించారు నారా లోకేష్. అక్రమాలకు పాల్పడుతున్న పోలీసులను తాము అధికారంలోకి వచ్చాక డిస్మిస్ చేస్తామనీ.. ప్రయివేటు కేసులు ఉన్న పోలీసులను మరచిపోమన్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version