వైసీపీ కార్యకర్త రేప్: భగ్గుమన్న టీడీపీ…!

-

రాష్ట్ర ప్రభుత్వంపై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు చేసారు. వైసీపీ పాలనలో మహిళకు రక్షణ కరువు అయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 300కి పైగా మహిళలపై దాడులు జరిగాయని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా యర్రంపాడులో బాలికపై వైసీపీ కార్యకర్త అత్యాచారం చేసారని ఆరోపించారు.

నేటికీ పోలీసులు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వైసీపీ నేతల అండతో నిందితుడు తప్పించుకునే యత్నం చేస్తున్నాడని అన్నారు. రాష్ట్రంలో దిశా చట్టం అమలు కావడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. వాలంటీర్ల ఆగడాలకు అంతే లేదని అన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు అఘాయిత్యాలకు పాల్పడుతున్న పోలీసులు చోద్యం చూస్తున్నారు అని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version