BREAKING : ఏపీ స్పీకర్ పై పేపర్లు విసిరిన టిడిపి ఎమ్మెల్యేలు

-

BREAKING : ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పై టిడిపి ఎమ్మెల్యేలు పేపర్లు విసిరారు.
ఏపీ అసెంబ్లీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్పు బిల్లును తీసుకొచ్చింది వైసీపీ సర్కార్. అయితే ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది టిడిపి పార్టీ. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్పు బిల్లును వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టారు టీడీపీ ఎమ్మెల్యేలు. అంతే కాదు స్పీకర్ పోడియం పైకి ఎక్కి నినాదాలు చేసారు టీడీపీ ఎమ్మెల్యేలు.

అయితే ఈ నేపథ్యంలోనే ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పై టిడిపి ఎమ్మెల్యేలు పేపర్లు విసిరారు. దీంతో ఆగ్రహంవ్యక్తం చేసిన స్పీకర్ అసెంబ్లీని వాయిదా వేశారు. ఇక ఈ ఇష్యూ పై అంబటి రాంబాబు మాట్లాడారు. టీడీపీ సభ్యులకు ఎన్టీఆర్ పేరును ప్రస్తావించే హక్కు లేదు…బుచ్చయ్య చౌదరి ఒక్కరికే ఎన్టీఆర్ పేరు ప్రస్తావించే హక్కు ఉందని వెల్లడించారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు ఇక్కడ ఉన్న సభ్యుల్లో బుచ్చయ్యచౌదరి ఒక్కరే ఎన్టీఆర్ పక్షాన నిలబడ్డారన్నారు. మిగిలిన వాళ్ళంతా వెన్నుపోటు దారులేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version