టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు: రాజకీయ కక్షలో భాగమే ఈ అరెస్టులు !

-

ఆంధ్రప్రదేశ్ లో తాజాగా జరిగిన రెండు అరెస్ట్ లపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తనదైన శైలిలో అధికార పార్టీపై వ్యాఖ్యలు చేశాడు. ఎంపీ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మెడకు వివేకా హత్య కేసు చుట్టుకుంటోంది. రాష్ట్ర ప్రజలు అంతా వాస్తవాలను తెలుసుకుంటున్నారు.. ఈ సమయంలో ప్రజల దృష్టిని మరల్చడానికి వేసిన ప్లాన్ లో భాగమే తాజాగా చేసిన టీడీపీ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు మరియు శ్రీనివాస్ అరెస్ట్ లు అంటూ ఎంపీ రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాలను అణగదొక్కి పెత్తనం చెలాయించే దిశగా అడుగులు వేస్తోందని అన్నారు.

గతంలోనూ అచ్చెన్నాయుడు మరియు కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసి ఇదే విధంగా జగన్ వ్యవహరించారు అన్నారు. ఇలా రాజకీయ కక్షలకు పాల్పడటం వలన ఉపయోగం ఏమీ ఉండదు, ప్రజల మనసును గెలుచుకోవడం కోసం ఏమైనా చేస్తే ఉపయోగం ఉంటుందని సెటైర్ వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version