భట్టి విక్రమార్క: కేసీఆర్ ఒక అవినీతి పరుడు… ప్రజలు బుద్ది చెబుతారు !

-

ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈయన మాట్లాడుతూ నేను గత కొద్దీ రోజులుగా చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిన్న ఖమ్మం సభతో ముగిసిందన్నారు. నిన్నటి సభలో రాహుల్ దేశానికి ఒక దిశను నిర్దేశించారన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మూలసిద్ధాంతాల కోసం ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాలన్నారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారన్నారు, అదే విధంగా తెలంగాణలోనూ కేసీఆర్ ను గద్దె దించడానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారని గుర్తు చేశారు. తెలంగాణాలో ఉన్న సంపదను ప్రజలకే చెందేలా కాంగ్రెస్ చేస్తుందన్న నమ్మకాన్ని ప్రజలు కలిగి ఉన్నారన్నారు.

సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఒక రాజులా పాలిస్తూ రాను రాను అవినీతి పరుడిలా మారుతున్నారని సంచలన కామెంట్ చేశాడు. రేపు జరగనున్న తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుంది అని ధీమాను వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version