Breaking : తెలంగాణలో మళ్లీ భారీ కరోనా కేసులు

-

యావత్తు ప్రపంచ దేశాలను అతాలకుతలం చేసిన కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతూ వస్తున్నాయి. దీనికి తోడు సీజనల్‌ వ్యాధులు కూడా తోడవుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా.. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 22,601 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 448 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 272 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 37, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 28 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 462 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,06,572 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,97,295 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. ఇంకా 5,166 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version