ఏపీ సీఎం చంద్రబాబుకు కొండా సురేఖ లేఖ రాశారు. తిరుమల శ్రీవారి టీటీడీ దర్శనాలపై ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. టీటీడీ అధికారులు తెలంగాణ భక్తులను అనుమతించకపోవడంపై తీవ్ర గందరగోళం నెలకొంటుందని ఈ లేఖలో పేర్కొన్నారు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.
సీఎం ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు కొండా సురేఖ. అధికారుల తీరుతో తెలంగాణ ప్రజాప్రతినిధులు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే ప్రత్యేకంగా పరిశీలించి సీఎం ఆదేశాలను సక్రమంగా పాటించేలా టీటీడీ అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఈ విషయమై ఏపీ సీఎం చంద్రబాబు సత్వరమే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు మంత్రి కొండా సురేఖ.