హస్తినకు చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై

-

తెలంగాణ గవర్నర్ తమిళి సై ఢిల్లీకి చేరుకున్నారు. గురువారం ఉదయం చెన్నై నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లారు తమిళసై. ఓ జాతీయ మీడియా ఛానల్ లో సదస్సు కోసం వచ్చానని చెప్పారు. తమిళిసై నేడు సాయంత్రం కేంద్ర మంత్రి అమిత్ షా ని కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై అమిత్ షా తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, బిఆర్ఎస్ పార్టీ అనంతరం నాయకులు కేంద్రంపై చేస్తున్న వ్యాఖ్యలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్, రాజ్ భవన్ – ప్రగతి భవన్ మధ్య విభేదాలు, గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులు తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అమిత్ షా తో భేటీ అనంతరం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి రానున్నారు తమిళిసై.

Read more RELATED
Recommended to you

Exit mobile version