ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

-

ఇంకో 100 కొత్త బస్సుల్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది తెలంగాణ ప్రభుత్వం. శనివారం ఆయన ట్యాంక్బండ్ వద్ద ప్రారంభించారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకి గుడ్ న్యూస్ చెప్పారు. 280 కోట్ల బకాయిలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు అధికారం లోకి వచ్చిన రెండు నెలల్లోనే ఆర్టీసీకి 500 కోట్లు ఇచ్చామని అన్నారు రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని అన్నారు.

రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో రెండు నెలల్లో 15 కోట్ల 27 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆర్టీసీ కార్మికులు అనేక కలలు కన్నారని అన్నారు రాష్ట్రం వస్తే తప్ప సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించినట్లు గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగలేదని చెప్పారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version