రెవెన్యూ చట్టంలో సరికొత్త వెబ్ సైట్ తెచ్చిన తెలంగాణా…!

-

తెలంగాణ శాసన సభలో రెవెన్యూ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టగా… ప్రవేశపెట్టిన బిల్లుల్లో భూమిపై హక్కులు, పాస్‌ పుస్తకాల చట్టం – 2020, గ్రామ రెవెన్యూ అధికారుల రద్దు చట్టం – 2020 పొందుపరిచారు. కేంద్ర, రాష్ట్రాల భూములకు చట్టంలోని అంశాలు వర్తించవు అని ప్రభుత్వం పేర్కొంది. భూ లావాదేవీలకు వెబ్‌ సైట్‌ ద్వారా స్లాట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Government if Telangana

సబ్‌ రిజిస్ట్రార్‌ ఇచ్చిన సమయానికి పత్రాలు ఇచ్చి సేవలు పొందాలని… భూములను మార్ట్‌ గేజ్ చేస్తే ధరణి వెబ్‌ సైట్‌లో నమోదు చేయించాలని స్పష్టం చేసింది. పూర్తిగా ఎలక్ట్రానిక్‌ విధానంలో భూ రికార్డుల నిర్వహణ ఉంటుందని పేర్కొంది. భూమి హక్కు పత్రం, పట్టాదారు పాస్‌ పుస్తకం ఏకీకృతం చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. భూ హక్కుల రికార్డుల్లో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు ఉంటాయని… ధరణి పోర్టల్‌ లో ఆన్‌ లైన్‌ ద్వారా భూ యాజమాన్య హక్కుల బదిలీ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version