Breaking : విగ్రహాతయారీ దారులకు శుభవార్త.. హైకోర్టు కీలక ఉత్తర్వులు

-

వినాయక విగ్రహాల తయారీ దారులకు తెలంగాణ హైకోర్టు శుభవార్త చెప్పింది. అంతేకాకుండా వినాయక నిమజ్జనంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. పీవోపీ విగ్రహాలను హుస్సేన్​సాగర్​లో నిమజ్జనం చేయవద్దన్న హైకోర్టు.. జీహెచ్​ఎంసీ నీటి గుంటల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. పీవోపీ విగ్రహాల నిషేధంపై గతంలో కేంద్ర పీసీబీ మార్గదర్శకాలు జారీ చేసింది హైకోర్టు.

ఆ మార్గదర్శకాలను సవాల్​ చేస్తూ హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది.విగ్రహ తయారీదారులు దాఖలు చేసిన పిటిషన్​పై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. పీవోపీ విగ్రహాలు నిషేధిస్తూ ప్రభుత్వం ఎలాంటి జీవో ఇవ్వలేదని తెలిపింది హైకోర్టు. విగ్రహాల ఎత్తు తగ్గించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థననూ తిరస్కరించింది. దుర్గాపూజపై పశ్చిమ్​ బంగా మార్గదర్శకాలు పరిశీలించాలని సూచించింది హైకోర్టు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version