తాలిబన్ల పాలన చూసి తెలంగాణ తల్లడిల్లుతోంది – వైఎస్ షర్మిల

-

బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ప్రశ్నల వర్షం కురిపించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. పెద్ద దొరను సీఎం ఎందుకు చేయాలో జర చెప్పు చిన్న దొర…? అని ప్రశ్నించారు. “రాష్ట్రాన్ని అధోగతి పాలుజేసినందుకా? స్కీముల పేరిట స్కాములు చేసినందుకా? కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు దోచుకుతిన్నందుకా? పాలమూరును కట్టకుండా దక్షిణ తెలంగాణను ఏడాది చేసినందుకా?..

16వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని.. 4.80లక్షల కోట్ల అప్పులపాలు చేసినందుకా? రుణమాఫీ, నిరుద్యోగ భృతి అంటూ మోసం చేసినందుకా? వడ్డీ లేని రుణాలు, కార్పొరేషన్ లోన్లు ఇస్తామని దగా చేసినందుకా? దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి అంటూ నిండా ముంచినందుకా? డబుల్ బెడ్ రూం ఇండ్లు, పోడు పట్టాలు ఇస్తామని కుచ్చుటోపీ పెట్టినందుకా? డిస్కంల దివాళా తీసి, ఆర్టీసీని ఆగంజేసి, ప్రభుత్వ భూములను కొల్లగొట్టినందుకా? ఉద్యమకారులను పక్కన పెట్టి, ఉద్యమ ద్రోహులను అక్కున చేర్చుకున్నందుకా?

జై తెలంగాణ అన్నోడు.. నై తెలంగాణ అంటున్నందుకా? తెలంగాణ తల్లికి ద్రోహం చేసి, తెలంగాణ తల్లి విగ్రహం అంటేనే చీదరించుకుంటున్నందుకా? కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే తెలంగాణ తల్లి తల్లడిల్లదు చిన్న దొర. మీ తాలిబన్ల పాలనను చూసి, ఎనిమిదేండ్లుగా తెలంగాణ తల్లి తల్లడిల్లుతోంది. దొరల పాలన విముక్తి కోసం ఆశగా ఎదురుచూస్తోంది. మీ నియంత పాలనను మీ ఫామ్ హౌజ్ కే పరిమితం చేయడానికి తెలంగాణ ప్రజానికం సిద్ధంగా ఉన్నరు” అంటూ తీవ్ర స్థాయిలో వండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version