Telangana : కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులు

-

తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 17న కొత్త సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆరోజునే సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆ రోజున ఉదయం 11.30 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. ప్రారంభోత్సవానికి ముందు వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం చేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా రాష్ట్ర కొత్త సచివాలయం ప్రారంభం కానుంది.

కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యంత్రి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఇతర నాయకులను ఆహ్వానించారు. ఈ వేడుకలో తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బిహార్ డిప్యూటీ సీఎం, జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version