షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో ఎన్నికలు : ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే కసరత్తు జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు కొత్తగా 15 లక్షల మంది ఓటర్లుగా చేరారు. 3.38 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించామని తెలిపారు.

వచ్చే నెలలో 3,4,5 తేదీల్లో ఈసీ తెలంగాణ పర్యటన ఉంటుందని.. కేంద్రం ,రాష్టానికి చెందిన 20 ఏజెన్సీ లతో సమావేశాలు ఉంటాయి. తుది ఓటర్ల జాబితా తర్వాత జిల్లాలో సిబ్బందికి శిక్షణ ఉంటుంది.  రాష్ట్ర ఎన్నికలకు రెండు,మూడు నెలలు నుంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. EVM ల చెకింగ్ జరుగుతుంది. ఓటర్ల జాబితా సవరణ కొనసాగుతుందని.. 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లు గా చేరుస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల షెడ్యూలను ఈసీ ఖరారు చేస్తుంది అని తెలిపారు. బోగస్ ఓట్ల పై పిర్యాదులు వస్తున్నాయి…మేము పారదర్శకంగా ఓటర్ల జాబితాను తయారు చేస్తామని వెల్లడించారు విసాస్ రాజ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version