వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో 14 కోడెలు మృతి !

-

వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో 14 కోడెలు మృతి చెందారు. నిన్న 8 కోడెలు మృతి చెందగా, నేడు మరో 6 కోడెలు మృతి చెందింది. దయనీయ స్థితిలో తిప్పాపూర్ గోశాలలో అనారోగ్యంతో బక్కచిక్కి దర్శనమిస్తున్నాయి కోడెలు. వేములవాడ ఆలయంలో భక్తులు దేవుడి చుట్టూ కోడెను తిప్పి తమ మొక్కులు చెల్లించుకుంటారు, ఆలయానికి అధిక మొత్తంలో ఆదాయం రావడంలో కోడెలే ప్రధాన కారణం అన్న సంగతి తెలిసిందే.

14 heifers die at Vemulawada Rajarajeshwara Swamy Temple
14 heifers die at Vemulawada Rajarajeshwara Swamy Temple

కోడెలను స్థోమతకు, స్థాయికి మించి తిప్పాపూర్ గోశాలలో కుక్కడంతో తరచూ వాటి మధ్య తొక్కిసలాటలు జరుగుతుంటాయని తెలుపుతున్నారు స్థానికులు. తిప్పాపూర్ గోశాలలో నిన్న అనారోగ్యంతో ఎనిమిది కోడెలు మృతిచెందగా, నేడు మరో 6 కోడెలు మృతిచెందడం దారుణమని మండిపడుతున్నారు భక్తులు. మరణించిన కోడెలను గుట్టుచప్పుడు కాకుండా పూడ్చి పెట్టారని ఆరోపిస్తున్నారు స్థానికులు.

https://twitter.com/TeluguScribe/status/1928700138685358525

Read more RELATED
Recommended to you

Latest news