రెవెన్యూ రాబడులు గణనీయంగా 25 శాతం పెరిగాయి: కాగ్‌ నివేదిక

-

2023 మార్చితో ముగిసిన ఏడాదికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం కాగ్ నివేదిక ప్రవేశపెట్టింది. రాష్ట్ర జీఎస్‌డీపీ 2021-22తో పోలిస్తే 2022-23లో 16 శాతం పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది. రెవెన్యూ రాబడులు గణనీయంగా 25 శాతం మేర పెరిగాయని తెలిపింది. రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు ఒక శాతం తగ్గిందని.. సొంత పన్నుల రాబడి గణనీయంగా 17 శాతం పెరిగిందని వెల్లడించింది. సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.2,06,977 కోట్లకు పెరిగినట్లు చెప్పింది.

“2023 మార్చి నాటికి పూర్తి కావాల్సిన 20 ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరిగింది. రూ.2,749 కోట్ల మేర ద్రవ్యలోటు తక్కువ చేసి చూపించారు. 2022-23లో ప్రభుత్వం ఇచ్చిన రుణాలు, అడ్వాన్స్‌లు 150 శాతం పెరిగాయి. సొంత రాబడి లేని సంస్థలకు ప్రభుత్వం రుణాలు ఏర్పాటు చేసింది. 2022-23లో బడ్జెట్ వెలుపలి రుణాలు రూ.1,18,629 కోట్లుగా అంచనా. ఆయా రుణాలకు ప్రభుత్వం తదుపరి రుణాలుగా రూ.17,829 కోట్లు అందించింది. రాష్ట్రాభివృద్ధి రుణాలపై వడ్డీపై ఖర్చు తక్కువగా అంచనా వేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను భారీగా అంచనా వేస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్ కంపెనీలకు బకాయిలు రాలేదు. ఇళ్లు, గొర్రెల పంపిణీ, ఆయిల్‌పామ్ పథకాల నిధులు ఖర్చు కాలేదు. దళితబంధు, రుణమాఫీ పథకాలకు కేటాయింపుల్లో భారీగా ఖర్చు కాలేదు.” అని కాగ్ నివేదిక పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news