26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

-

బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు గజ్జెల కాంతం ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడే అర్హత హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారంతా ఇతర పార్టీల వారే అన్నారు. బీజేపీ పార్టీకి రాష్ట్రంలో లీడర్లు లేరన్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపేందుకు చర్చిస్తున్నారన్నారు.

26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు రెడీగా ఉన్నారన్నారు. ఈడీకి, సీబీఐకి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ దోచిన రూ. వేల కోట్లపై విచారణ చేయాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో సంపాదించిన వేల కోట్లను ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టారని ఆమె సన్నిహితులే అంటున్నారని తెలిపారు. కవితను అరెస్ట్ చేయడమే కాదు శిక్ష కూడా వేయాలన్నారు. అయితేనే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి కాదని రుజువు అవుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version