పెద్దపల్లి జిల్లాలో దారుణం.. 30 కోతులను చంపిన గుర్తుతెలియని వ్యక్తులు

-

రాష్ట్రంలో ఇటీవల కోతుల వల్ల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. మొన్నటిదాక కోతుల వల్ల రైతులు, ప్రజలు ఇబ్బందులు మాత్రమే పడ్డారు. కానీ ఇప్పుడు వాటి నుంచి తప్పించుకునే క్రమంలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే కోతుల బెడద ఎక్కువవుతోందని కొంత మంది దారుణాలకు పాల్పడుతున్నారు. విచక్షణారహితంగా వాటిని చంపేందుకు కూడా వెనకాడటం లేదు. తాజాగా ఇలాంటి ఓ అమానవీయ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి గ్రామంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు 30 కోతులను చంపి గ్రామ సమీపంలో పడివేసి వెళ్లిపోయారు. గత రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కోతుల మృతదేహాలను గుర్తించిన స్థానికులు విషయాన్ని సర్పంచ్ కల్వల శ్రావణ్ కు తెలియజేయగా ఆయన పోలీసులతోపాటు అటవీ, వైద్య సిబ్బందికి విషయం తెలియజేశారు . ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. 30 కోతుల మృతదేహాలను గ్రామంలో పడేసిన ఘటనపై విచారణ నిర్వహించి నిందితులను పట్టుకుంటామని తెలియజేశారు

Read more RELATED
Recommended to you

Exit mobile version