ఎలుక కొరకడంతో నెలన్నర చిన్నారి మృతి

-

నాగర్కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. 40 నెలల శిశువును ఎలుక కొరకడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. శిశువు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన నాగనూల్‌లోని శివ, లక్ష్మీకళ దంపతులకు 40 రోజుల క్రితం మగ శిశువు జన్మించాడు. శనివారం రాత్రి తల్లి లక్ష్మీకళ తన బాబుతో కలిసి ఇంట్లో నేలపై పడుకుంది. అయితే వారి ఇంట్లో ఎక్కువగా ఎలుకలు ఉన్నాయి. రాత్రి సమయంలో అవి బయటకు వచ్చి నానా హంగామా చేసేవి. అయితే శనివారం రాత్రి సమయంలో కూడా అలా బయటకు వచ్చిన ఎలుకలు నేలపై తల్లితో నిద్రిస్తున్న చిన్నారి ముక్కును ఎలుక కొరికాయి. నిద్రలో ఉన్న చిన్నారికి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో శిశువు ఏడుపు మొదలు పెట్టాడు. అప్రమత్తమై వెంటనే తల్లిదండ్రులు పట్టణ ఆసుపత్రికి తరలించారు. తరువాత హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం చిన్నారి మరణించాడు. బాబు మరణంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version