SLBC టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది మృతి

-

SLBC టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది మృతి చెందారు. మరణించారు ఆరుగురు కార్మికులు, ఇద్దరూ ఇంజినీర్లు. అధునాతన పరికరాలు, రాడార్ లతో 3 మీటర్ల లోతు మట్టిలో మృతదేహాలున్నాయి. గత కొద్ది రోజుల నుంచి వారి ఆచూకి కోసం గాలించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఇవాళ వారి సమాచారం తెలిసింది. 8 మంది సజీవ సమాది అయ్యారు. 

నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంలో 8 మంది  కోసం దాదాపు 6 రోజుల నుంచి శ్రమించారు.  ఈ క్రమంలోనే అందులో చిక్కుకున్న  8 మందిని  బయటకు తీసుకు వచ్చేందుకు ఇప్పటికే  ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, హైడ్రా, సింగరేణి రెస్క్యూ టీమ్ సైతం శ్రమించాయి. బురద, నీరు సహాయక చర్యలకు అడ్డుతగిలినప్పటికీ వీరిని ఎలాగైనా బయటకు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం కూడా ముందుకు వెల్లింది.

Read more RELATED
Recommended to you

Latest news