తెలంగాణలో మరో దారుణం..వందేభారత్‌ ను ఢీ కొని గేదె మృతి

-

తెలంగాణలో మరో దారుణం చోటు చేసుకుంది. వందేభారత్‌ ను ఢీ కొని గేదె మృతి చెందింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం టీక్యాతండా శివారులో వందే భారత్‌ రైలుకు ప్రమాదం తప్పింది. రైలుకు అడ్డుగా వచ్చిన గేదెను ఢీ కొనడంతో… గేదె అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ ప్రమాదంతో రైలు నిలిపివేసి..సంఘటన స్థలాన్ని పరిశీలించారు డ్రైవర్. ఈ ఘటనలో రైలుకు ఎలాంటి డ్యామేజీ కాలేదని గుర్తించారు రైల్వే అధికారులు. టిక్యాతండా ఘటన తర్వాత రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు.. రైల్వే ట్రాక్ పై గేదెలను పంపిస్తే.. వాటివల ప్రమాదం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని గ్రామస్తులను హెచ్చరించారు రైల్వే పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version