జోగులాంబ అమ్మవారికి బంగారు కిరీటం..ధర ఎంతంటే ?

-

జోగులాంబ అమ్మవారికి అరుదైన కానుక వచ్చింది. జోగులాంబ అమ్మవారికి బంగారు కిరీటం అందజేశారు. 1.587 కిలోల బంగారు కెరటాన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగులు అందించారు. ఈ బంగారు కిరీటం విలువ కోటి 60 లక్షలకు పైగా ఉంటుందని ఈ సమాచారం అందుతోంది. కిరీటంపై తేలు, గుడ్లగూబ, బల్లి అలాగే కపాలంతో ఉన్న ప్రతిమలు ఉన్నాయి.

A golden crown for Goddess Jogulamba

ఈ బంగారు కిరీటాన్ని ఈవో పురేందర్, చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, ధర్మకర్తలకు అందించారు బెంగళూరు, హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగుల బృందం. మొక్కుబడి లో భాగంగా హైదరాబాద్ అలాగే బెంగళూరుకు సంబంధించిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని తీసుకొని బంగారు కిరీటాన్ని జోగులాంబ అమ్మవారికి అప్పగించారు.

  • జోగులాంబ అమ్మవారికి బంగారు కిరీటం..
  • 1.587 కిలోల బంగారు కిరీటాన్ని బహుకరించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు
  • ఈ బంగారు కిరీటం విలువ రూ.కోటి 60 లక్షలకుపైగా ఉంటుంది
  • కిరీటంపై తేలు, గుడ్లగూడ, బల్లి, కపాలంతో ఉన్న ప్రతిమలు
  • బంగారు కిరీటాన్ని ఈవో పురేందర్, చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, ధర్మకర్తలకు అందించిన బెంగళూరు, హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల బృందం

Read more RELATED
Recommended to you

Latest news