తెలంగాణలో విషాదం..మటన్ ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి

-

తెలంగాణ రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మటన్ ముక్క ఇరుక్కుని ఒక వ్యక్తి మృతి చెందాడు. పెళ్లి విందులో మాంసం ముక్క గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం హనుమాన్ ఫారంలో నిన్న జరిగిన పెళ్లి విందులో, రమణ గౌడ్ అనే వ్యక్తి మటన్ తిన్నాడు. ఓ ముక్క గొంతులో ఇరుక్కుని, ఊపిరి ఆడక కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. గ్యాస్ సమస్యతో పాటు హాట్ స్ట్రోక్ రావడంతో మరణించినట్లు చెప్పారు. కాగా రమణ గౌడ్ వయస్సు (45) సంవత్సరాలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version