జగిత్యాల కాంగ్రెస్ లో ముసలం..సంజయ్ పై అడ్లూరి వివాదాస్పద వ్యాఖ్యలు!

-

జగిత్యాల కాంగ్రెస్ లో ముసలం నెలకొంది..జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అడ్లూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను ఉద్దేశించి కాంగ్రెస్ విప్ అడ్లూరి లక్ష్మణ్…సంచలన వ్యాఖ్యలు చేశారు.

adluri laxman on jagtial mla sanjay

గంజాయి తాగి మత్తులో మర్డర్లు చేస్తున్నారని బూతులతో విరుచుకుపడ్డారు అడ్లూరి లక్ష్మణ్.
కాంగ్రెస్ పార్టీలో నాకు ఏం విలువ లేదు.. జగిత్యాల జిల్లా అధ్యక్షుడిని అయినా ఏ కార్యక్రమాల్లో పాల్గొనలేదని పేర్కొన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ పక్కన కూడా తిరగలేదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి, సంజయ్ గురించి ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. ఇక అటు జగిత్యాల కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్యతో తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కొందరు కావాలనే గంగారెడ్డి హత్యను రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version