దొంగలు కత్తితో దాడిచేసినా.. ధైర్యంగా వారిని పట్టుకున్న బాధితుడు !

-

సెల్‌ఫోన్ దొంగలు కత్తితో దాడిచేసినా.. ధైర్యంగా వారిని వదలకుండా పట్టుకున్నాడు బాధితుడు. ఈ సంఘటన హైదరాబాద్‌ జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ వెంగల్ రావునగర్‌లో జాషువా అనే హాస్టల్ ఓనర్ తన హాస్టల్ సమీపంలో ఉండగా, బల్బీర్ సింగ్ మరియు రామ్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు కాల్ చేయమని కోరుతూ అతని వద్దకు వచ్చారు.

Although the robbers attacked with a knife.. the victim bravely caught them

జాషువా తన ఫోన్‌ను వారికి ఇచ్చాడు, కాని వారు దానితో పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే గ్రహించిన జాషువా.. వారు తప్పించుకోకుండా వెంటనే వారిని పట్టుకున్నాడు. అయితే ఆ దొంగలు జాషువాపై దాడి చేసి, కొట్టి, కత్తితో బెదిరించారు.. అయినా కూడా జాషువా వారిని ధైర్యంగా అలాగే పట్టుకున్నాడు. ఈ ఘటనను గమనించిన హాస్టల్‌ విద్యార్థులు వెంటనే జాషువాకు సహాయం చేసి పోలీసులకు ఫోన్ చేసి దొంగలను పట్టించారు.

Read more RELATED
Recommended to you

Latest news