ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు శ్రవణ్ రావుకు నోటీసులు జారీ చేసింది దర్యాప్తు బృందం. ఇవాళ పంజాగుట్ట PS లో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. ఈనెల 26న శ్రావణ్ రావు కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేసిన పోలీసులు… మూడు రోజుల తర్వాత విచారణకు హాజరు కావాలని తెలిపారు.
పోలీస్ విచారణకు సహకరించాలని శ్రావణ్ రావుకు ఆదేశాలను జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో ప్రధాన నిందితుడు SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు లపై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసారు పోలీసులు. శ్రావణ్ రావును విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్న పోలీసులు… ఈ కేసులో నిందితుడు శ్రవణ్ రావుకు నోటీసులు జారీ చేశారు.