చంద్రబాబు పిటిషన్లపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్..!

-

చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్. సీఐడీ కస్టడి పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే, సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు ముగిసిన అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పు వెలువరుస్తామని తెలిపింది. బెయిల్ పిటిషన్ పై గురువారమే చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు  వినిపించారు.

వాదనలు ముగిసిన తరువాత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పును రిజర్వు చేసింది. సోమవారం తీర్పును వెలువరిస్తామని తెలిపింది.  బెయిల్ పిటిషన్ పై గురువారమే చంద్రబాబు తరపు న్యాయవాదనలు పూర్తి కాగా.. సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు మరికొన్ని వాదనలు వినిపిస్తానని కోర్టును కోరారు. దీంతో ఇవాళ ఆయన మరికొన్ని అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. అనంతరం సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై కూడా వాదనలు జరిగాయి. సీఐడీ తరపున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తూ బ్యాంకు ఖాతాల వివరాలను తెలుసుకోవాల్సి ఉందని.. చంద్రబాబును కస్టడికి ఇవ్వాలని కోరారు. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబె వాదనలు వినిపించారు. ఒకసారి కస్టడీకి ఇచ్చారని.. రెండోసారి ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version