ముస్లిం బంధు ఇవ్వాలి – అసదుద్దీన్ ఓవైసీ

-

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో దళితులకు దళిత బంధు ఇచ్చినట్లే.. ముస్లింలకు ముస్లిం బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముస్లింలలో ఎక్కువ శాతం మంది పేదలు ఉన్నారని చెప్పారు. ఈ విషయాన్ని గతంలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లామని.. కానీ ఆయన స్పందించలేదని తెలిపారు.

ఇక తెలంగాణలో వచ్చే ఎన్నికలలో మెజారిటీ స్థానాలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎక్కడెక్కడ పోటీ చేస్తాం అనేది ఎన్నికల ముందు జాబితా ప్రకటిస్తామని తెలిపారు. ఇక బోధన్ లో ఎమ్మెల్యే షకీల్ కి ఎన్నికల ద్వారా తగిన బుద్ధి చెబుతామని అన్నారు. ఇటీవలే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే షకీల్ ఫిర్యాదుతో మజ్లిస్ నేతలు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version