ఆత్మ సాక్షి సర్వే విడుదల.. ఆ పార్టీకే సంపూర్థ మెజారిటీ

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మరో సర్వే రిపోర్ట్ వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై శ్రీ ఆత్మ సాక్షి సర్వే చేసింది. అయితే.. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై శ్రీ ఆత్మ సాక్షి సర్వే విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం.. బీఆర్‌ఎస్‌ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చింది. దీంతో సీఎం కేసీఆర్‌ మరోసారి అంటే హ్యట్రిక్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారు. కాకపోతే.. దాదాపు 20 సీట్లు తగ్గే ఛాన్స్‌ ఉంది.

ఆత్మ సాక్షి సర్వే ప్రకారం… సీట్ల వారీగా

బీఆర్ఎస్ : 64-70
కాంగ్రెస్ : 37-43
బీజేపీ : 5-6
ఏంఐఎం : 6-7
గట్టి పోటీ ఉన్నవి : 6

ఓట్ షేర్ వారీగా
బీఆర్ఎస్ : 42.5%
కాంగ్రెస్ : 36.5%
బీజేపీ : 10.75%
ఏంఐఎం : 2.75%
ఇతరులు : 7.5%

గతంలో దుబ్బాక, హుజురాబాద్, నాగార్జున సాగర్, కర్ణాటక సర్వేలను సరిగ్గా అంచనా వేసిన శ్రీ ఆత్మ సాక్షి టీం..ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సర్వే విడుదల చేసింది. కాగా.. ఓట్ షేర్ పై మిషన్ చాణక్య సర్వే చేయగా…బీఆర్ఎస్ కు 44.62%, కాంగ్రెస్ కు 32.71%, బిజెపికి 17.6%, ఇతరులకు 5.07% ఓట్లు వస్తాయని అంచనా వేసింది బీఆర్ఎస్ కు స్పష్టమైన ఆదిక్యం వస్తుందని సర్వే రిపోర్ట్ తేల్చింది. అటు నిన్న విడుదలైన ఇండియా టీవీ సర్వే కూడా బిఆర్ఎస్ మెజార్టీ సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version