పెట్రోల్ పోసి మహిళకు నిప్పు పెట్టిన దుండగులు..చేతబడి చేసిందని !

-

మెదక్ రామాయంపేట (మం) కాట్రియాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ముత్తవ్వ అనే మహిళపై పెట్రోల్ పోసి నిప్పటించారు గుర్తు తెలియని దుండగులు. మంత్రాల నేపంతోనే దాడి జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Atrocity in Katriyala village of Ramayampeta mandal of Medak district

మెదక్ రామాయంపేట (మం) కాట్రియాల గ్రామానికి చెందిన ముత్తవ్వ చేతబడి చేస్తుందంటూ అనుమానం పెంచుకున్నారట గ్రామస్థులు. దీంతో అర్థరాత్రి ముత్తవ్వ ఇంట్లో నిద్రిస్తున్నటువంటి సమయంలో మహిళపై పెట్రోల్ పోసి తగలబెట్టారు దుండగులు. ఇక ప్రాణభయంతో ముత్తవ్వ కుటుంబ సభ్యులు పారిపోయారు. చుట్టు పక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందింది ముత్తవ్వ. ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులో తీసుకున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version