జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజారుద్దీన్ కీలక ప్రకటన చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి నేనే అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ వేరే అభ్యర్థికి ఇస్తుందని పుకార్లు వస్తున్నాయి అవన్నీ నిజం కాదు, టికెట్ నాకే వస్తుందని వెల్లడించారు.

పార్టీ కోసం చాలాకాలంగా కష్టపడుతున్నాను, అధిష్టానం నాకే టికెట్ ఇస్తుందన్నారు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజారుద్దీన్. ఇది ఇలా ఉండగా జూబ్లీహిల్స్ గులాబీ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించిన సంగతి తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో ఆయన మృతి చెందారు. దీంతో డిసెంబర్ లోపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుందని చెబుతున్నారు. అందుకే కాంగ్రెస్ నేతలు తమకు టికెట్ కావాలంటే తమకు కావాలంటూ తమ వాదన వినిపిస్తున్నారు.