బతుకమ్మ, బోనాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి – దత్తాత్రేయ

-

బతుకమ్మ, బోనాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలన్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. సింహవాహిని మహంకాళి అమ్మవారి దర్శనం కోసం లాల్ దర్వాజ ఆలయానికి చేరుకున్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఈ సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ప్రజలందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్పారు.

తెలంగాణ బోనాల ఉత్సవాలకు ఒక ప్రత్యేక స్థానం ఉందని వివరించారు. బతుకమ్మ, బోనాలకు అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. కుల మతాలకు అతీతంగా పండుగ జరుపుకోవాలని కోరుతున్నానని చెప్పుకొచ్చారు. దేశ సంస్కృతి ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పే విధంగా ప్రధాని మోదీ అనేక కార్యకమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ.

Read more RELATED
Recommended to you

Exit mobile version