జగన్.. అబ్దుల్ కలాం కంటే తోపా?… డిక్లరేషన్‌ పై బండి సంజయ్ హాట్‌ కామెంట్స్..!

-

జగన్.. అబ్దుల్ కలాం కంటే తోపా? అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తీరు హిందుత్వంపై దాడి… డిక్లరేషన్ ఇస్తే తప్పేంది? అంటూ నిలదీశారు. అన్యమతస్తులు హిందూ ఆలయాల్లోకి ప్రవేశిస్తే డిక్లరేషన్ ఇచ్చిన ఉదంతాలెన్నో ఉన్నాయని… దళితులు అసలైన హిందూ ధర్మ రక్షకులు అని చెప్పారు. దళితులను క్రిస్టియన్లు గా మార్చే కుట్ర సాగుతోందని.. బీఫ్ తినేటోళ్లను, నక్సలైట్ల భావజాలమున్న వాళ్లను విద్యా కమిషన్ లో చోటు కల్పిస్తారా? అంటూ నిలదీశారు.

Bandi Sanjay hot comments on Jagan’s declaration

మమ్మీ అంటే దెయ్యం… డాడీ అంటే గాడిద.. మమ్మీ, డాడీ కల్చర్ మనకొద్దు… అమ్మానాన్నే ముద్దన్నారు బండి సంజయ్‌. ర్యాంకుల కోసం బట్టీ చదువులకే… ఉగ్రవాద బీజం వేస్తున్న మదర్సాలకు సాయం చేయడమేంది? అని నిలదీశారు. విజ్ఝానంతోపాటు దేశభక్తి, క్రమశిక్షణ నేర్పే శిశు మందిర్ లను విస్మరిస్తారా? అని ఆగ్రహించారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version